గాజువాక,నిజంన్యూస్ :
ప్రపంచంలో కరోనా అనే మహమ్మారి విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడం వలన ప్రజలు చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నా కొంత మంది ప్రజలకు డబ్బులు రాక ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే .ఈ నేపథ్యంలో 76 వ వార్డు వైయస్సార్ సిపి అభ్యర్థి దొడ్డి రమణ అధికారులు, సచివాలయ సిబ్బంది వాలంటరీ సిబ్బందితో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. అలాగే నిరుపేదలైన రెండు కుటుంబాలకి వాలంటరీ సహాయంతో 1000/- రూపాయలు దొడ్డి రమణ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రమణ, పెంటారావు, సొన సంతోష్, ఆనంద్, శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.
అందరికీ జగనన్న సాయం అందేలా చూస్తాం : దొడ్డి రమణ